యాప్నగరం

ఏపీలో ముందస్తు ఎన్నికలు..?: మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీ సర్కారు ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం అవుతోందా..? మంత్రి వ్యాఖ్యలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది.

TNN 21 Jan 2018, 5:54 pm
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుతుందని మోదీ పదే పదే చెబుతున్నారు. జమిలీ ఎన్నికలే సరైనవని ప్రధాని మోదీ తరచుగా తన మనసులోని మాట బయట పెడుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి కేంద్రం ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్లోనే కేంద్రం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, కేంద్రంలో వాతావరణం అలాగే ఉందని ఆయన తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మనం కూడా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.
Samayam Telugu get ready to face elections before 2019 yanamala
ఏపీలో ముందస్తు ఎన్నికలు..?: మంత్రి కీలక వ్యాఖ్యలు


శనివారం సెక్రటేరియట్‌లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో యనమల ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను చంద్రబాబు కూడా ఖండించకపోవడం గమనార్హం. కేబినెట్ సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడిన సందర్భంలో సీఎం సైతం ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. ‘అన్ని ఎన్నికలు’ ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని 40-50 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది. 120కిపైగా నియోజకవర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత ఉంది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఉన్న స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఏపీ సర్కారు కూడా ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.