యాప్నగరం

5 అంతస్తుల భవనాన్ని 5 సెకన్లలో కూల్చేశారు

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలని గుర్తించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ..

Mumbai Mirror 16 May 2017, 9:55 am
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలని గుర్తించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ.. అక్రమంగా వెలిసిన భవనాల్ని కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం సికింద్రాబాద్‌లోని సున్నం చెరువు ప్రాంతంలో ఇంప్లోజన్ టెక్నాలజీ సహాయంతో నిన్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చేసింది జీహెచ్ఎంసీ.
Samayam Telugu ghmc destoyed 5 storeyed building with in five seconds with implosion technology
5 అంతస్తుల భవనాన్ని 5 సెకన్లలో కూల్చేశారు


తొలుత మే 8వ తేదీనే ఈ ఇంప్లోజన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వినియోగిస్తూ ఈ 5 అంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పుడు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ధ్వంసమై మిగతా భవనం అలాపై నేలపై వాలిపోయింది. భవనం పూర్తిగా శిథిలం కాకపోవడంతో ఈసారి మరింత జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది జీహెచ్ఎంసీ.

జేఎన్‌టీయూ నిపుణుల సూచనల మేరకు ముందుగానే భవనం గోడలు ధ్వంసం చేసిన తర్వాత భవనాన్ని నేలకూల్చారు. ఇందుకోసం మొత్తం 17.25 కిలోల పేలుడు సామాగ్రితోపాటు 169 డిటోనేటర్లు వినియోగించారు. సోమవారం జరిపిన ఈ ఆపరేషన్‌ని విజయవంతంగానే పూర్తి చేసినప్పటికీ అటుగా వెళ్తున్న ముగ్గురు కార్మికులకి పేలుడు కారణంగా గాయాలయ్యాయి. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు కారణంగా సమీపంలోని భవనాలకి ఎటువంటి డ్యామేజీ జరగలేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.