ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నవారు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అనుకుంటే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్లానే భంగపడాల్సి ఉంటుంది. గ్రేటర్ ప్రథమ పౌరుడైన ఆయన కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురికావడం నగరంలో చర్చనీయాంశమైంది. చట్టం ముందు అందరూ ఒకటేనని నిరూపించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేమైందంటే.. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మో్హన్ ఏపీ09 సీ9969 నంబరు గల ఫార్చ్యునర్ కారులో గురువారం మధ్యాహ్నం మాదాపూర్ వెళ్లారు. ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఐ ల్యాబ్ వద్ద నో పార్కింగ్ బోర్డు ఉన్న చోట తన కారు నిలిపారు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి కారు ఫోటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్, సైబరాబాద్ పోలీస్, తెలంగాణ డీజీపీకి ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సైబరాబాద్ పోలీసు విభాగం.. దాన్ని ట్రాఫిక్ ట్విటర్ ఖాతాకు రీట్వీట్ చేసింది.
దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఐ ల్యాబ్ వద్దకు చేరుకుని మేయర్ కారుకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో భాగస్వామ్యమవుతున్న నెటిజన్లను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. చట్టం ఎవరికైనా ఒకటే అంటూ మేయర్ కారుకు కూడా ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఐ ల్యాబ్ వద్దకు చేరుకుని మేయర్ కారుకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో భాగస్వామ్యమవుతున్న నెటిజన్లను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. చట్టం ఎవరికైనా ఒకటే అంటూ మేయర్ కారుకు కూడా ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.