యాప్నగరం

టీడీపీలో చేరి.. వైసీపీని పొగిడిన ఎమ్మెల్యే!

ఈమె మాటలను వైసీపీ వర్గాలు స్వాగతిస్తున్నాయి.

TNN 27 Nov 2017, 3:04 pm
తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. ఆ ప్రకటన చేసిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి. గిరిజన సంక్షేమం కోసమే తను తెలుగుదేశం తీర్థం తీసుకుంటున్నట్టుగా ప్రకటించుకున్న ఈ ఎమ్మెల్యే.. ఈ విషయాలన్నీ చెబుతూనే.. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. అని చెప్పడం గమనార్హం.
Samayam Telugu giddi eeshwari tongue slip
టీడీపీలో చేరి.. వైసీపీని పొగిడిన ఎమ్మెల్యే!


ఇంతకీ ఈశ్వరి ఏమన్నారంటే.. ‘రేపటి 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నేను చెప్పలేను కానీ, పాడేరు అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని చెప్పగలను.. ’ అని అన్నారు. మరి పాడేరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె తెలుగుదేశం పార్టీలోకి పోతూ పోతూ.. అక్కడ వైసీపీనే గెలుస్తుంది.. అని అనడం విశేషంగా మారింది.

బహుశా.. ఇది అలవాట్లో పొరపాటు అయ్యి ఉండవచ్చు. మూడున్నరేళ్ల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వరి అదే ఊపుతో మాట్లాడి ఉండవచ్చు. అయితే.. ఈమె మాటలు వైసీపీ వాళ్లకు వరప్రదంగా మారాయి. పార్టీ నుంచి పోతూ పోతూ.. పాడేరు, అరకుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. అని ఈమె వ్యాఖ్యానించడాన్ని.. వైసీపీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. వెళ్తూ వెళ్తూ.. ఆమె వాస్తవమే చెప్పిందని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఈశ్వరి ప్రెస్ మీట్ ను ప్రస్తావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.