యాప్నగరం

​అంత్యక్రియలకు డబ్బుల్లేక కూతురు శవాన్ని...!

నాలాలో దొరికిన యువతి శవం గురించి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయకరమైన వాస్తవాలు తెలిశాయి.

TNN 3 Jun 2017, 8:34 am
నాలాలో దొరికిన యువతి శవం గురించి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయకరమైన వాస్తవాలు తెలిశాయి. గుర్తు తెలియని ఆమెను ఎవరో చంపేసి పడేశారని భావించి విచారణ చేపట్టగా.. ఆమెది ఆత్మహత్య అని తేలింది. మరి శవం నాలాలోకి ఎలా వచ్చిందనే అంశంపై విచారిస్తే.. అంత్యక్రియల ఖర్చుకు భయపడి, ఆమె తండ్రి అక్కడ పడేశాడనే గగుర్పొడిచే వాస్తవం తెలిసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీగూడలో చోటు చేసుకుంది.
Samayam Telugu girl death mystery revealed
​అంత్యక్రియలకు డబ్బుల్లేక కూతురు శవాన్ని...!


పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీగూడకు చెందిన పెంటయ్య కూతురు భవాని(16). ఏడో తరగతి వరకే చదివిన ఆమె తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు అలవాటు పడింది. కూతురిని కట్టడి చేయడానికి తండ్రి ఆమెను ఇంట్లోనే నిర్భించాడు. అయితే ఆయన పనికి వెళ్లినప్పడు లక్ష్మీ మళ్లీ తన స్నేహితులను కలిసింది. ఈ విషయాన్ని స్థానికులు పెంటయ్యకు తెలిపారు. ఈ క్రమంలో తండ్రి ఏమైనా అంటాడేమో అని భవాని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.

బాత్ రూమ్ లో ఉరేసుకుని మరణించిన కూతురుని గమనించిన పెంటయ్య.. పోలీసులకు సమాచారం అందించకుండా, కనీసం ఇరుగుపొరుగుకు కూడా తెలియకుండా శవాన్ని తీసుకెళ్లి నాలాలో పడేశాడు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాడు. నాలాలో శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హత్యకేసుగా పరిగణించి విచారణ చేపట్టారు. కేసును ఛేదించారు. యువతి పేరు భవాని అని, ఆమె తండ్రి పెంటయ్య అని తెలుసుకుని.. ఆయనను పిలిపించి విచారించారు.

మొత్తం విషయాన్ని బయటపెట్టాడు పెంటయ్య. తనకు చాలా అప్పులున్నాయని... అంత్యక్రియలు నిర్వహిస్తే మరింత ఖర్చు అవుతుందనే భయంతోనే కూతురి శవాన్ని నాలాలో పడేశానని ఆయన చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పెంటయ్య కొడుకు కూడా కొన్నాళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని మరణించాడని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.