యాప్నగరం

ఎనిమిదేళ్ల బాలికకు శ్రీవారితో వివాహోత్సవం!

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వెంకటరమణ స్వామి ఆలయంలో ఒక విభిన్నమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది.

Samayam Telugu 4 May 2018, 10:25 am
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వెంకటరమణ స్వామి ఆలయంలో ఒక విభిన్నమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడ శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇతర వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో జరిగే కల్యాణోత్సవానికి చాలా భిన్నంగా ఇక్కడ బాలికలను శ్రీవారికి ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
Samayam Telugu Girl


తాజాగా గురువారం రాయదుర్గం పట్టణంలోని వెంకట రమణస్వామి ఆలయంలో సంప్రదాయ కల్యాణోత్సవం జరిగింది. ఈ సారి కూడా ఎనిమిదేళ్ల బాలికను శ్రీవారికి ఇచ్చి వివాహం చేశారు.

వేదమంత్రోచ్ఛారణతో ఆహ్వానితుల సమక్షంలో ఈ వివాహోత్సవం జరిగింది. ఎనిమిదేళ్ల రేఖను పద్మావతీ నామంతో శ్రీవారికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇది పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయం అని, ఇలా చేస్తే బాలికకు జీవితంలో మంచి మొగుడు వస్తాడనేది స్థానికుల నమ్మకం.

ప్రత్యేకించి పద్మశాలి వంశంలోని అరవ తెగ వారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రతియేటా ఒక్కో బాలికకు ఇలా శ్రీవారిని వివాహమాడే అవకాశం లభిస్తూ ఉంటుంది. యుక్తవయసు వచ్చాకా ఈ బాలికకు తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. చిన్నవయసులో స్వామి వారితో వివాహం వల్ల ఆమెకు జీవితంలో సద్గుణాలున్న భర్త లభిస్తాడనే నమ్మకమని స్థానికులు చెబుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.