తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని గోదావరి ఆంధ్రప్రదేశ్ లో పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లోని ఎక్కడెక్కడి వాగులూ వంకలు నిండిపోయాయి. వాటికి తోడు పలు ఉపనదులు కూడా నిండుకున్నాయి. అన్నీ కలిసి గోదారమ్మలో కలవడంతో నదిలో నీరు రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కుతోంది. రాజమహేంద్రి వద్ద గల దవళేశ్వరం ఆనకట్ట వద్దకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. రానున్న మరో రెండు రోజుల్లో నీటిమట్టం మరింతగా పెరుగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆనకట్టకు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదిలేస్తున్నారు. నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు కూడా జారీఅయ్యాయి.
పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ
తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని గోదావరి ఆంధ్రప్రదేశ్ లో పరవళ్లు తొక్కుతోంది
TNN 25 Sep 2016, 6:50 pm