బెజవాడ నుంచి రాయగడ వెళ్లే ఎక్స్ప్రెస్ ఇకపై గుంటూరు నుంచి నడవనుంది. నాలుగు రోజుల క్రితమే ఈ ప్యాసింజర్ రైలును ఎక్స్ప్రెస్గా మార్చిన అధికారులు... ఇకపై గుంటూరు వరకు నడపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక మరో కారణాన్ని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రైన్ విజయవాడ నుంచి ప్రారంభమై విశాఖ మీదుగా రాయగడ వెళుతుంది. అయితే రాయగడ నుంచి బెజవాడ వచ్చిన రైలును గుంటూరుకు తరలించి అక్కడ బోగీలను శుభ్రం చేయిస్తారు. తర్వాత ఖాళీ రైలు విజయవాడ వెళ్లి... అక్కడి నుంచి బయల్దేరి రాయగడ వెళుతుంది.
గుంటూరు నుంచి బెజవాడ వరకు ఖాళీ ట్రైన్ను పంపించడం వల్ల రూ. లక్షల్లో నష్టం వస్తోందట. అందుకే ఈ ఎక్స్ప్రెస్ను గుంటూరు నుంచి నడిపితే... ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావించారు. అలాగే రైల్వేశాఖకు ఆదాయం కూడా వస్తుందంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇకపై రాయగడ ఎక్స్ప్రెస్ గుంటూరులో రాత్రి 10గంటల 15 నిమిషాలకు బయల్దేరి... మంగళగిరికి 10.45కు... విజయవాడకు 11గంటల 15నిమిషాలకు వెళుతుంది. అక్కడి నుంచి రాత్రి 11.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.23నిమిషాలకు రాయగడ చేరుకుంటుంది.
రాయగడ నుంచి బయల్దేరే రైలు రాత్రి 8.50గంటలకు ప్రారంభమై... మరుసటి రోజు ఉదయం 6.25నిమిషాలకు గుంటూరుకు వస్తుంది. ఈ ట్రైన్కు గుంటూరు నుంచి బెర్తుల రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం లేదు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాత్కాలికంగానే ఈ ఎక్స్ప్రెస్ను గుంటూరు నుంచి నడుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
గుంటూరు నుంచి బెజవాడ వరకు ఖాళీ ట్రైన్ను పంపించడం వల్ల రూ. లక్షల్లో నష్టం వస్తోందట. అందుకే ఈ ఎక్స్ప్రెస్ను గుంటూరు నుంచి నడిపితే... ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావించారు. అలాగే రైల్వేశాఖకు ఆదాయం కూడా వస్తుందంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇకపై రాయగడ ఎక్స్ప్రెస్ గుంటూరులో రాత్రి 10గంటల 15 నిమిషాలకు బయల్దేరి... మంగళగిరికి 10.45కు... విజయవాడకు 11గంటల 15నిమిషాలకు వెళుతుంది. అక్కడి నుంచి రాత్రి 11.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.23నిమిషాలకు రాయగడ చేరుకుంటుంది.
రాయగడ నుంచి బయల్దేరే రైలు రాత్రి 8.50గంటలకు ప్రారంభమై... మరుసటి రోజు ఉదయం 6.25నిమిషాలకు గుంటూరుకు వస్తుంది. ఈ ట్రైన్కు గుంటూరు నుంచి బెర్తుల రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం లేదు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాత్కాలికంగానే ఈ ఎక్స్ప్రెస్ను గుంటూరు నుంచి నడుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.