యాప్నగరం

జగన్ సీఎంకావాలని, తిరుమలకు పాదయాత్ర!

తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర

TNN 21 Oct 2017, 10:21 am
Samayam Telugu gopireddy paadayatra to thirumala for ys jagan
జగన్ సీఎంకావాలని, తిరుమలకు పాదయాత్ర!
​తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్టుగా ప్రకటించారు నర్సరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జగన్ సీఎం కావాలనే కోరికతో పాటు, ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాని ఆకాంక్షిస్తూ ఈ యాత్రను చేపట్టనున్నట్టుగా ఆయన ప్రకటించారు. నేటి నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుందని గోపిరెడ్డి ప్రకటించారు.

తనతో పాటు 150 మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారని, నర్సరావు పేట నుంచి తిరుమల వరకూ ఈ పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. రోజుకు ముప్పై కిలోమీటర్ల దూరం పాటు నడుస్తామని పేర్కొన్నారు.

ఈ పాదయాత్ర ప్రారంభానికి పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని గోపిరెడ్డి ప్రకటించారు. బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిన్నెల్లి, ఆళ్ల, కోన రఘుపతి,మహ్మద్ ముస్తఫా,అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు తదితర నేతలు పాదయాత్ర ప్రారంభోత్సవానికి హాజరవుతారని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.