క్షేత్రస్థాయిలో కులవృత్తులను బలోపేతం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని లబ్ధిదారులే పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం అందించిన గొర్రెలను విక్రయించకూడదని తెలిసినా.. దురాశతో వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నాన్ని ఖమ్మం జిల్లా బయ్యారం పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.
కేసీఆర్ ప్రతిష్టాత్మక గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఇటీవల బయ్యారం మండలంలో 82 యూనిట్లు గ్రౌండ్ చేశారు. వాటిలో ఇర్సులాపురానికి చెందిన కేస వీరన్న, కాసం వీరయ్యకు గొర్రెలు పంపిణీ అయ్యాయి. గొర్రెలను తీసుకున్న కొద్ది రోజులకే 16 గొర్రెలను అదే గ్రామానికి చెందిన పున్నెవర్తి కృష్ణయ్యకు విక్రయించారు. వాటితో పాటు, తన వద్ద ఉన్న మరో నాలుగు గొర్రెలను కలుపుకుని మొత్తం 20 గొర్రెలను సంతలో విక్రయించేందకు ఆదివారం ఆటో ట్రాలీలో కృష్ణయ్య బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న బయ్యారం పోలీసులు ట్రాలీ అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను ఎవరూ గుర్తించకుండా వాటి చెవులకు వేసిన ట్యాగ్లను లబ్ధిదారులు వీరన్న, వీరయ్య కట్ చేశారు. దీంతో వీరిద్దరితో పాటు కృష్ణయ్య, ట్రాలీ డ్రైవర్పై బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ చేసిన గొర్రెల చెవులకున్న ట్యాగ్లు తొలగించి, వాటినే ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత మంచి పథకం పెట్టినా వ్యవస్థ సరిగా లేకపోతే ఇలాంటి తప్పులే జరుగుతాయి. సీఎం కేసీఆర్ ఎంత సంకల్పించుకున్నా.. లబ్ధిదారులు పక్కదోవ పడుతుంటే ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది.
కేసీఆర్ ప్రతిష్టాత్మక గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఇటీవల బయ్యారం మండలంలో 82 యూనిట్లు గ్రౌండ్ చేశారు. వాటిలో ఇర్సులాపురానికి చెందిన కేస వీరన్న, కాసం వీరయ్యకు గొర్రెలు పంపిణీ అయ్యాయి. గొర్రెలను తీసుకున్న కొద్ది రోజులకే 16 గొర్రెలను అదే గ్రామానికి చెందిన పున్నెవర్తి కృష్ణయ్యకు విక్రయించారు. వాటితో పాటు, తన వద్ద ఉన్న మరో నాలుగు గొర్రెలను కలుపుకుని మొత్తం 20 గొర్రెలను సంతలో విక్రయించేందకు ఆదివారం ఆటో ట్రాలీలో కృష్ణయ్య బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న బయ్యారం పోలీసులు ట్రాలీ అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను ఎవరూ గుర్తించకుండా వాటి చెవులకు వేసిన ట్యాగ్లను లబ్ధిదారులు వీరన్న, వీరయ్య కట్ చేశారు. దీంతో వీరిద్దరితో పాటు కృష్ణయ్య, ట్రాలీ డ్రైవర్పై బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ చేసిన గొర్రెల చెవులకున్న ట్యాగ్లు తొలగించి, వాటినే ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత మంచి పథకం పెట్టినా వ్యవస్థ సరిగా లేకపోతే ఇలాంటి తప్పులే జరుగుతాయి. సీఎం కేసీఆర్ ఎంత సంకల్పించుకున్నా.. లబ్ధిదారులు పక్కదోవ పడుతుంటే ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది.