యాప్నగరం

బాపుఘాట్‌లో గవర్నర్, సీఎం నివాళి

మహాత్మా గాంధీ 148వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపుఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

TNN 2 Oct 2017, 12:12 pm
మహాత్మా గాంధీ 148వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపుఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసానితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు.. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ చేరుకొని గాంధీజీకి నివాళులర్పించారు.
Samayam Telugu governor cm kcr pay tribute to mahatma gandhi at bapu ghat
బాపుఘాట్‌లో గవర్నర్, సీఎం నివాళి


మహాత్మా గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.