యాప్నగరం

గవర్నర్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. బాబు వ్యాఖ్యల ఎఫెక్ట్?

రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్.. ఊహించని రీతిలో పర్యటన మధ్యలోనే వెనక్కి వచ్చేశారు.

Samayam Telugu 25 Apr 2018, 11:46 am
గవర్నర్‌ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్.. ఊహించని రీతిలో పర్యటన మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌‌లతో భేటీ అయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తేవడం ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం. కానీ ప్రధానిని కలవకుండానే ఆయన అర్ధాంతరంగా పర్యటన ముగించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Samayam Telugu governer with modi


గవర్నర్‌ వ్యవహరిస్తోన్న తీరుపై మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను గవర్నర్ ఏకం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇదే నిజమైతే నరసింహన్ తీరు సరికాదంటూ ఘాటుగా స్పందించారు. బాబు వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగియడం ప్రస్తావనార్హం.

సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లిన గవర్నర్.. షెడ్యూల్‌లో లేనప్పటికీ.. మార్గమధ్యంలో విజయవాడలో ఆగి చంద్రబాబుతో రెండు గంటలు భేటీ అయ్యారు. అంతకు ముందే రాజ్‌భవన్లో గవర్నర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.