ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్పేట్- హైటెక్ సిటీ మెట్రో మార్గం బుధవారం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్పేట్ స్టేషన్లో జెండా ఊపి మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్పేట్లో రైలు మారాల్సి ఉంటుంది.
అమీర్పేట్- హైటెక్ సిటీ మెట్రో మార్గంలో అమీర్పేటతో పాటు మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్సిటీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు ప్రారంభానికి మరికొద్ది సమయం పడుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్తమార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించిందని పేర్కొన్నారు.
వాస్తవానికి అమీర్పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని నలుమూలల నుంచి ఈ ప్రాంతాలకు వస్తున్నప్పుడు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు ఎంతో ఊరట లభించింది.
అమీర్పేట్- హైటెక్ సిటీ మెట్రో మార్గంలో అమీర్పేటతో పాటు మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్సిటీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు ప్రారంభానికి మరికొద్ది సమయం పడుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్తమార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించిందని పేర్కొన్నారు.
వాస్తవానికి అమీర్పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని నలుమూలల నుంచి ఈ ప్రాంతాలకు వస్తున్నప్పుడు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు ఎంతో ఊరట లభించింది.