యాప్నగరం

ఆ ఘటన గవర్నర్ పరిధిలోనిది.. స్పీకర్ ఎలా సస్పెండ్ చేస్తారు?: జానారెడ్డి

ఇది తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే. నిరసన తెలపడానికి ప్రయత్నించిన క్రమంలో జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలో ఉంది. నిర్ణయం కూడా గవర్నర్ తీసుకోవాలి.

Samayam Telugu 13 Mar 2018, 12:48 pm
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం సీఎల్పీ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికం, సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘ఇది తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే. నిరసన తెలపడానికి ప్రయత్నించిన క్రమంలో జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలో ఉంది. నిర్ణయం కూడా గవర్నర్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి సభ స్పీకర్ ఆధీనంలోకి వెళ్తుంది. అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్‌కు ఈ రోజు నుంచి అధికారం ఉంటుంద’ని జానా రెడ్డి తెలిపారు.
Samayam Telugu governor has the power how speaker can suspend us jana reddy
ఆ ఘటన గవర్నర్ పరిధిలోనిది.. స్పీకర్ ఎలా సస్పెండ్ చేస్తారు?: జానారెడ్డి


స్పీకర్ నిర్ణయం పట్ల మా స్పందనను సభకు తెలిపే అవకాశం ఇవ్వలేదని ప్రధాన ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారో చెప్పాలని స్పీకర్‌ను నిలదీశారు. పార్లమెంట్‌లో సభ్యులు ఆందోళనలు చేపడుతున్న తీరును ఆయన ప్రస్తావించారు.

‘నిరసన వ్యక్తం చేసే సమయంలో నేను సంయమనం పాటించాను. అల్లర్లలో నాకు ఎలాంటి బాధ్యత లేదు. కానీ సస్పెండ్ చేయడం దారుణం. బడ్జెట్‌ను అంకెల గారడీగా రూపొందిస్తున్నారు. నాలుగేళ్లుగా సంయమనంతో వ్యవహరించాం. బడ్జెట్లో ప్రభుత్వం తప్పుల్ని వేలెత్తి చూపే అవకాశం లేకుండా మమ్మల్ని సస్పెండ్ చేశారు. ప్రజలారా.. సస్పెన్షన్ వల్ల మా వాణిని అసెంబ్లీలో వినిపించలేకపోయాం. మీడియా ద్వారా బడ్జెట్ లోపాల్ని ఎత్తి చూపుతాం. ప్రజా సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని జానా రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.