తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి.భోగీ మంటలతో పండుగకు స్వాగతం పలికారు తెలుగు ప్రజలు. కాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ నరసింహన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆనందంగా పండుగను చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతిలో భాగమైపోయిందని అన్నారు. రాష్ట్రంలోని రైతన్నలకు అంతా మేలే జరగాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని అన్నారు. ప్రేమ, స్నేహబంధం, అనురాగం, సోదరభావాలతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి.
TNN 13 Jan 2017, 4:44 pm