యాప్నగరం

వైద్యం కోసం ‘గాంధీ’కి గవర్నర్..

వైద్య చికిత్సల కోసం గవర్నర్‌ నరసింహన్‌ సాధారణ పౌరుడిలా గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఆయన ఆసుపత్రిలోని ఓపీ విభాగానికి వెళ్లి డాక్టర్లను కలిశారు..

TNN 23 Aug 2017, 1:52 pm
వైద్య చికిత్సల కోసం గవర్నర్‌ నరసింహన్‌ సాధారణ పౌరుడిలా గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఆయన ఆసుపత్రిలోని ఓపీ విభాగానికి వెళ్లి డాక్టర్లను కలిశారు. తన కుడి పాదంపై అయిన కాయ గురించి వైద్యులకు వివరించి.. వారి సలహా తీసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ సుభోద్‌, జనరల్‌ సర్జన్‌ వీఎన్‌ రెడ్డి.. గవర్నర్‌ పాదాన్ని పరిశీలించి, చిన్నపాటి సర్జరీ చేయించుకోవాలని సూచించారు.
Samayam Telugu governor narasimhan goes to gandhi hospital for medical treatment
వైద్యం కోసం ‘గాంధీ’కి గవర్నర్..


ఈ సందర్భంగా.. గాంధీ సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ నరసింహారావు, చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ జయకృష్ణ తదితరులు గవర్నర్‌ వెంట ఉన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని నరసింహన్ వారికి సూచించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పరిశుభ్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

రోగుల అవసరాల దృష్ట్యా ఆసుపత్రిలో మరో ఎమ్మారై యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గాంధీ వైద్యులు గవర్నర్‌ను కోరారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. గవర్నర్ స్థాయి వ్యక్తి గాంధీ ఆసుపత్రికి వెళ్లడం ఆహ్వానించదగిన పరిణామం. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న భావనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు వైద్య సేవలు కూడా ఉంటే.. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ మరింతగా పెరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.