యాప్నగరం

ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి రోజులు..

సున్నిత అంశాలను ఎక్కువగా ప్రచారం చేయొద్దని మీడియాకు గవర్నర్ సూచించారు. జనాభా పెరుగుతుండటంతో కొన్ని సమస్యలు తప్పవని..

TNN 10 Aug 2017, 5:49 pm
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యానికి మంచి రోజులు వస్తున్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తెలంగాణలో గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పడుతున్నాయని ఆయన తెలిపారు. గురువారం (ఆగస్టు 10) ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి గాంధీ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 65 పడకల ఐసీయూ, రేడియాలజీ మిషిన్, రక్తపరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ప్రభుత్వ దావాఖానాల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
Samayam Telugu governor narasimhan inaugurates modern icu in gandhi hospital
ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి రోజులు..


‘ఏడాది కిందట గాంధీ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడి అసౌకర్యాలపై ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లా.. ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని గవర్నర్ అన్నారు. రోగులు కూడా బాధ్యతతో వ్యవహరించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలని ఆయన కోరారు.

సున్నిత అంశాలను ఎక్కువగా ప్రచారం చేయొద్దని మీడియాకు గవర్నర్ సూచించారు. జనాభా పెరుగుతుండటంతో కొన్ని సమస్యలు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు. చెత్త చెదారం పేరుకుపోయి దుర్భరంగా తయారైందని చూపెట్టడానికి బదులు.. ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంలో చొరవ తీసుకున్న తర్వాత వార్త రాయడం ద్వారా సరైన మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కూడా మన ఇళ్ల మాదిరిగానే ఉంచుకోవాలనే కనీస అవగాహన ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.