ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర పెద్దలు, ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన పీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితుల గురించి వివరించినట్లు సమాచారం. ప్రధానంగా ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితి, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పీఎంవో అధికారులతో గవర్నర్ నరసింహన్ భేటీ
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.
TNN 18 Apr 2016, 1:20 pm