యాప్నగరం

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి: గవర్నర్

విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ప్రజల సహకారం ఉండాలి. పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనం. శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదని..

Samayam Telugu 21 Oct 2018, 11:37 am
పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు గవర్నర్నర్ నరసింహన్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అలాగే పోలీసు అమరవీరుల పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అమరులైన పోలీసుల సేవల్ని నరసింహన్ కొనియాడారు.
Samayam Telugu Governor


విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ప్రజల సహకారం ఉండాలన్నారు గవర్నర్. పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని.. శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా నిలుస్తుందన్నారు. అమరవీరులను తిరిగి తీసుకురాలేము కానీ.. వారు చేసిన సేవల్ని మాత్రం స్మరించుకుందామన్నారు.

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. శాంతి భద్రతలు లేనిదే అభివృద్ధి జరగదని.. సమాజంలో శాంతి భద్రతలకు అవసరమైతే ప్రాణదానం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ దోరణిలో సంఘ విద్రోహక శక్తులు పెట్రేగిపోయి హింసకు పాల్పడుతున్నారని.. శక్తుల్ని ఎదుర్కొంటూ ఎంతోమంది పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ, ప్రోత్సాహం పొందుతున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.