యాప్నగరం

తక్కువ సమయంలోనే ఎంతో ప్రగతి సాధించాం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

TNN 10 Mar 2017, 10:58 am
తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, చేపట్టబోయే కొత్త పథకాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తక్కువ సమయంలోనే చాలా అభివృద్ధిని సాధించిందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రభుత్వ పాలన ప్రజలకు మరింతగా చేరువవుతుందన్నారు. రాష్ట్రం 13.2 శాతం వృద్ధిరేటు సాధించిందని, సేవారంగం 14.6 శాతం వృద్ధి, వ్యవసాయం అనుబంధ రంగం 17.2 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. ఒంటరి మహిళలకు నెలకు రూ.1000 జీవన భృతిని ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కూళ్లు , హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. 27 వేలకు పైగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు.
Samayam Telugu governor narasimhan speech in telangana assembly
తక్కువ సమయంలోనే ఎంతో ప్రగతి సాధించాం


సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, కరెంటు కష్టాలను అధిగమించామని అన్నారు. సాగుకు పగటిపూటే 9గంట విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను సమర్థవంతంగా అమలుజరుగుతోందన్నారు. 35.30 లక్షల మందిర రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని తెలిపారు గవర్నర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.