యాప్నగరం

దటీజ్ నరసింహన్.. కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ పోలీసులకు విషెస్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.

TNN 20 Oct 2017, 11:40 am
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. సాధారణంగా గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహంగానే భావిస్తారు అందరూ. నరసింహన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలంగా పనిచేసి గవర్నర్‌గా తనదైన ముద్రవేసిన ఆయన.. రాష్ట్రాలో విడిపోయినా తెలుగు ప్రజలకు దగ్గరగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మమేకమవుతూ.. ప్రభుత్వ సేవకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. కాగా, తాజాగా ఓ ఘటన తనలోని ప్రత్యేకతను మరోసారి బయటపెట్టింది.
Samayam Telugu governor narasimhan stops his convoy to wish traffic police
దటీజ్ నరసింహన్.. కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ పోలీసులకు విషెస్


గురువారం దీపావళి సందర్భంగా రాజ్‌భవన్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయానికి వెళ్లిన నరసింహన్.. తన కాన్వాయ్‌లో రాజ్‌భవన్‌కు బయలుదేరారు. కాన్వాయ్ ఖైరతాబాద్ జంక్షన్ మీదుగా వెళ్తుండగా.. అక్కడ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తుండటాన్ని గవర్నర్ చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపించిన గవర్నర్.. వాహనంలో నుంచి దిగి అక్కడున్న ట్రాఫిక్ పోలీసులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ నేరుగా తమ వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలుపడంతో ట్రాఫిక్ పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.