నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం నింపేందుకు పనులు జరుగుతున్నాయి. వెలగపూడి గ్రామంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో పచ్చదనం, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా మార్చేందుకు పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి.
పచ్చదనంతో ముస్తాబవుతున్న రాజధాని
నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం నింపేందుకు పనులు జరుగుతున్నాయి.
TNN 23 Nov 2016, 6:09 pm