యాప్నగరం

టీడీపీపై కోపంతో ఏపీకి అన్యాయం చేయకండి.. అవిశ్వాసంపై పవన్ ట్వీట్

రాజకీయాలు పక్కన పెట్టి ఏపీకి కేంద్రం న్యాయం చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్. అవిశ్వాసంపై జనసేనాని ట్విట్టర్‌లో స్పందించారు. టీడీపీపై కోపంతో ఏపీకి అన్యాయం చేయకుండా.. రాజకీయాలు పక్కన పెట్టి ఏపీకి న్యాయం చేయాలని కోరారు.

Samayam Telugu 20 Jul 2018, 10:58 am
రాజకీయాలు పక్కన పెట్టి ఏపీకి కేంద్రం న్యాయం చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్. అవిశ్వాసంపై జనసేనాని ట్విట్టర్‌లో స్పందించారు. వరుస ట్వీట్లలో..‘ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించాలని ఏపీ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు.. మా హక్కుల గురించి అర్థం చేసుకోండి. దయచేసి న్యాయం చేయండి. టీడీపీపై ఉన్న కోపంతో ప్రత్యేక హోదాను నిరాకరించకండి. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలు ఇచ్చిన సమయాన్ని వృధా చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలి’అన్నారు పవన్.
Samayam Telugu pawan


లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగనుండటంతో అందరూ స్పందిస్తున్నారు. పవన్ కూడా ట్వీట్లు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేయొద్దంటూ కేంద్రాన్ని కోరారు. పనిలో పనిగా బీజేపీకి, టీడీపీలకు చురకలు అంటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.