యాప్నగరం

జీహెచ్ఎంసీ బాండ్లు బీఎస్ఈలో లిస్టింగ్

దేశ చ‌రిత్ర‌లోనే హైద‌ర‌బాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌(జీహెచ్ఎంసీ) మ‌రో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. బాండ్ల ద్వారా తొలివిడతగా రూ.200 కోట్ల నిధులను సమీకరించి హైదరాబాద్‌ నగర పాలక సంస్థ అధికారికంగా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైంది.

TNN & Agencies 23 Feb 2018, 11:53 am
దేశ చ‌రిత్ర‌లోనే హైద‌ర‌బాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌(జీహెచ్ఎంసీ) మ‌రో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. బాండ్ల ద్వారా తొలివిడతగా రూ.200 కోట్ల నిధులను సమీకరించి హైదరాబాద్‌ నగర పాలక సంస్థ అధికారికంగా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైంది. ఈ నిధులతో హైదరాబాద్‌ నగరాన్ని సిగ్న‌ల్ రహిత నగరంగా చేయడానికి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకాన్ని (ఎస్‌ఆర్‌డీపీ) చేపడతారు. ఆర్ధిక క్రమ శిక్షణ, ఆదాయ మార్గాల స్థిరత్వం, అంతర్గత వనరుల వృద్ధి, మిగులు నిధులు తదితర అంశాల్లో నమ్మకమైన పురపాలక సంస్థగా ఏఏ స్టేబుల్‌ రేటింగ్‌ సాధించడంతో బాండ్ల జారీ సులువైంది. దశల వారీగా ఎస్‌ఆర్‌డిపి కోసం రూ.1000 కోట్లను బల్దియా బాండ్ల రూపంలో సేకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి దశలో రూ.200 కోట్లను సేకరించింది. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ లిస్టింగ్‌ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. జోషి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు,మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యద ర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవీలతో పాటు పలువురు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్‌కె. జోషి మాట్లాడుతూ, బాండ్ల ద్వారా నిధుల సేకరణతో దేశంలోనే హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిం దన్నారు. స్థానిక సంస్థలు నిధుల కోసం ప్రభుత్వాలపై ఆదారపడకుండా సొంతంగా సమకూర్చుకోవాలని సూచించారు. ఇందులో ఇతర మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు జీహెచ్‌ఎంసీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రేటింగ్‌ సంస్థల అంచనా ప్రకారం డబుల్‌ ఏ స్టేబుల్‌ స్థాయిని సాధించిన జీహెచ్‌ఎంసీ భవిష్యతఔక్తులో త్రిబుల్‌ ఏ పాజిటివ్‌ సాధించాల న్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాండ్ల సేకరణ ద్వారా జీహెచ్‌ఎంసీ స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్టింగ్‌ నమోదు కావడం చారిత్రాత్మక ఘట్టమని జోషి అభినందించారు.
Samayam Telugu greater hyderabad municipal corporation ghmc has listed its municipal bonds on the bombay stock exchange bse
జీహెచ్ఎంసీ బాండ్లు బీఎస్ఈలో లిస్టింగ్


అనంతరం రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రామ కృష్ణారావు మాట్లాడుతూ, దేశంలో ఉన్న 4,041 మున్సిపాలిటీల్లో మెరుగైన పౌర, మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 39 లక్షల కోట్లు అవసరమని అహ్లువాలియా కమిటీ పేర్కొన్నదన్నారు. ఇంత భారీ స్థాయిలో నిధులను ఏ ప్రభుత్వాలు కూడా సమకూర్చే పరిస్థితి లేనందువల్ల అంతర్గత వనరులను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఆర్ధిక స్తోమతపై అంతగా నమ్మకం ఉండదని… అయితే ఈ విషయాన్ని త‌ప్ప‌ని రుజువు చేస్తూ బాండ్ల ద్వారా జీహెచ్‌ఎంసీ రెండు వందల కోట్ల నిధులను సేకరించడం గొప్ప విషయమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.