యాప్నగరం

జీహెచ్ఎంసీకి అమృత్ ప్రైజ్

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బాండ్ల రూపంలో నిధులను సేకరించినందుకు ప్రోత్సాహకరంగా రూ. 26 కోట్ల చెక్కును దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్యదర్శి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిలకు అందచేశారు.

Samayam Telugu 29 Jul 2018, 11:59 am
Samayam Telugu జీహెచ్ఎంసీకి అమృత్ ప్రైజ్
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బాండ్ల రూపంలో నిధులను సేకరించినందుకు ప్రోత్సాహకరంగా రూ. 26 కోట్ల చెక్కును దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్యదర్శి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిలకు అందచేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం సాయంత్రం రెండురోజుల ట్రాన్స్‌ఫార్మింగ్‌అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీహాజరయ్యారు.

జీహెచ్‌ఎంసీలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బల్దియా చేపట్టిన ఎస్‌ఆర్డీపీ( వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం)కి బాండ్ల రూపంలో రూ. 200కోట్లను సేకరించి నందుకుగాను ‘అమృత్ పథకం’ కింద రూ. 26 కోట్ల ప్రోత్సాహక బహుమతి, ప్రత్యేకప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గృహనిర్మాణం, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి, గవర్నర్ రాంలాల్ హాజరైన ఈ సమావేశంలో పురస్కారాన్ని ప్రధాన మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిలకు ముందు వరసలో సీటు కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రధానికి ‘స్వచ్ఛ నమస్కారం’ అంటూ గౌరవించడంలోనూ తమ ప్రత్యేకత చూపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.