యాప్నగరం

మనకు అన్నీ తెలుసనుకుంటాం... కానీ: మంచు లక్ష్మీ

హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ప్ర‌పంచ ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సులో పాల్గొన్ని, ప్రసంగించే అవకాశం మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు ల‌క్ష్మీకి దక్కిన విషయం తెలిసిందే.

TNN 28 Nov 2017, 6:09 pm
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ప్ర‌పంచ ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సులో పాల్గొన్ని, ప్రసంగించే అవకాశం మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు ల‌క్ష్మీకి దక్కిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సుకు లక్ష్మీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఒక‌ తెలుగు మ‌హిళ‌గా ఇందులో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. చాలా సందర్భాల్లో మ‌న‌కి అన్నీ తెలుసనుకుంటామ‌ని, ఇలాంటి సదస్సులకు వ‌చ్చిన‌ వారిని క‌లిసిన‌ప్పుడు తెలియ‌ని ఎన్నో విష‌యాల‌ను నేర్చుకుంటామ‌ని తెలిపారు. జీవితం అంటే ఇంతే కాదు, ఎంతో తెలుసుకోవాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో వివిధ వర్గాలకు చెందిన మ‌హిళా ప్ర‌తినిధులు పారిశ్రామిక రంగం గురించి తమ ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటార‌ని పేర్కొన్నారు.
Samayam Telugu gse 2017 actor manchu lakshmi resopned about her participation
మనకు అన్నీ తెలుసనుకుంటాం... కానీ: మంచు లక్ష్మీ


ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించే అరుదైన అవకాశం తన కుమార్తెకు లభించడంపై మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యల గురించి ప్రసంగించనున్న లక్ష్మిపై మోహన్ బాబు ప్రశంసలు జల్లు కురిపించారు. నా కుమార్తెను చూసి ఎంతో గర్విస్తున్నా. గ్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగించే మహిళల ప్యానల్‌లో ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. లక్ష్మికి మరింత శక్తి చేకూరాలని... భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.