యాప్నగరం

నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం

వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

TNN 16 May 2017, 10:55 am
వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఒక్కరోజు పాటు ప్రత్యేకంగా ఏపీ శాసనసభ, మండలి సమావేశమయ్యాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి యనమల జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమవ్వగానే వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద పెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు రోజుల పాటూ సభను నిర్వహించాలని, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారు నినాదాలు చేస్తున్నా కూడా అధికార పక్షం పట్టించుకోలేదు. ఒకరి తరువాత ఒకరు ప్రసంగించారు.
Samayam Telugu gst bill passed in andhra pradesh assembly
నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం


ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఈ బిల్లు వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఒకే దేశం... ఒకే పన్ను విధానం వల్ల అంతే మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనిని కేంద్రం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణగా పేర్కొన్నారు. అనంతరం సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. అలాగే ప్రజా సేవల చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు బిల్లులో మార్పులు చేశారు. అనంతరం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జీఎస్టీ బిల్లుకు ఎప్పుడో ఆమోద ముద్ర పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.