యాప్నగరం

ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం: చంద్రబాబు

ఏపీ హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని 5 కోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు.

TNN 17 Feb 2018, 4:34 pm
ఏపీ హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని 5 కోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు. చేయని తప్పునకు తాము శిక్ష అనుభవిస్తున్నామని, హేతుబద్ధతతో విభజన జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకాని వద్ద జేఎన్టీయూ భవనాలకు ఆయన శనివారం (ఫిబ్రవరి 17) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
Samayam Telugu guntur cm chandrababu naidu talks on ap bifurcation issues
ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం: చంద్రబాబు


‘రాష్ట్రానికి న్యాయం చేయాలనే బీజేపీతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నాం. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్లా. అయినా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాలా నష్టపోయింది. తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఊరుకోబోం, ఎలాంటి త్యాగానికైనా సిద్ధం’ అని చంద్రబాబు అన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనని, పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిరుత్సాహపడితే ఏం చేయలేమని అన్నారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపులేకపోతున్నామని, నవనిర్మాణ దీక్ష చేస్తున్నామని గుర్తు చేశారు.

‘ఇలాంటి సమయంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు అకౌంట్స్‌ అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తాం. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం’ అని చంద్రబాబు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.