యాప్నగరం

అక్రమ సంబంధం.. భర్త మర్మాంగంపై బండతో మోది..

అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను హతమార్చడానికి మహిళలు వెనుకాడటం లేదు. జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వ్యామోహంతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

Samayam Telugu 21 Oct 2018, 10:35 am
వివాహేతర సంబంధాలు పలు కుటుంబాల్లో విషాదం నింపుతోన్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వ్యామోహంతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను హతమార్చడానికి మహిళలు వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దురదృష్ట‌క‌ర‌ ఘటనలు గత ఆరు నెలల్లో అనేకం సంభవించాయి. తాజాగా మరో మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో భర్తను హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫిరంగిపురం మండలం శిరంగిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Samayam Telugu extramarital affairs


పోలీసుల కథనం ప్రకారం...శిరంగిపాలెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ చుక్కా రత్నబాబు(27)కు తొమ్మిదేళ్ల క్రితం స్వర్ణలత అనే మహిళతో వివాహమైంది. అయితే, ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయమైన వీరి మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వర్ణలత తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల ముందు పంచాయితీ పెట్టడంతో స్వర్ణలతకు నచ్చజెప్పి 15 రోజుల కిందట రత్నబాబు వద్దకు పంపారు. అయినా సరే ఆమె తీరు మారలేదు. తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో శుక్రవారం రాత్రి అతడిని హతమార్చింది.

నిద్రపోతున్న రత్నబాబు గొంతు నులిమి, రోకలి బండతో మర్మాంగంపై దాడిచేయడంతో అతడి అక్కడికక్కడే మృతిచెందాడు. తెల్లవారేసరికి ఈ విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదుచేసి వివరాలు సేకరించారు. నిందితురాలు స్వర్ణలతను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో ప్రియుడి హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.