ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టాడు. తీరా ఎస్సై ఉద్యోగం వచ్చే సరికి మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు న్యాయం కావాలంటూ ఏకంగా ఎస్సై పనిచేసే స్టేషన్ ముందే ధర్నాకు దిగింది. తన న్యాయం జరిగి.. భర్త తిరిగి కాపురానికి తీసుకెళ్లే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగింది. నెల్లూరు జిల్లా సంగంకు చెందిన నాగార్జున, లావణ్యలు కలిసి చదువుకోగా.. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకొని.. అక్కడే కాపురం కూడా పెట్టారు. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కు వెళుతున్నానని లావణ్యకు చెప్పి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో మొన్నటి వరకు పుట్టింటిలోనే ఉంటోంది.
నాగార్జును గుంటూరు జిల్లా అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్లో ఉన్నాడని లావణ్యకు తెలిసింది. దీంతో ఆమె నేరుగా అచ్చంపేట చేరుకొని.. అతడు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆమెను చూసి షాక్ తిన్న నాగార్జున.. ఎందుకు వచ్చావు అంటూ ఊగిపోయాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాగి.. తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.
లావణ్య పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, సర్టిఫికెట్తో ధర్నాకు దిగింది. నాగార్జున తనను కాపురానికి తీసుకెళ్ళేవరకు దీక్ష చేస్తానని పట్టుబట్టి కూర్చొంది. ట్రైనింగ్ పేరుతో భర్త రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లలేదని.. ఉద్యోగం రావడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.
నాగార్జును గుంటూరు జిల్లా అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్లో ఉన్నాడని లావణ్యకు తెలిసింది. దీంతో ఆమె నేరుగా అచ్చంపేట చేరుకొని.. అతడు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆమెను చూసి షాక్ తిన్న నాగార్జున.. ఎందుకు వచ్చావు అంటూ ఊగిపోయాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాగి.. తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.
లావణ్య పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, సర్టిఫికెట్తో ధర్నాకు దిగింది. నాగార్జున తనను కాపురానికి తీసుకెళ్ళేవరకు దీక్ష చేస్తానని పట్టుబట్టి కూర్చొంది. ట్రైనింగ్ పేరుతో భర్త రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లలేదని.. ఉద్యోగం రావడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.