యాప్నగరం

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీలోకి..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే

TNN 23 Sep 2017, 2:00 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో అనంతపురం టౌన్ నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యేగా వ్యవహరించాడు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన కొత్తలోనే కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేల్లో గురునాథ్ రెడ్డి ఒకరు.
Samayam Telugu gurunath reddy to join tdp
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీలోకి..?


కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారీయన. మంచి మెజారిటీతో అనంతపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి విజయం సాధించారు.

సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి తో గురునాథ్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయని.. గురునాథ్ రెడ్డి అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని గురునాథ్ రెడ్డి ఇంత వరకూ సమర్థించనూ లేదు, ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.