యాప్నగరం

టీడీపీపై ఈర్ష్య పడేంత సీన్ లేదు: జీవీఎల్

బీజేపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కొట్టిపారేశారు.

Samayam Telugu 29 Sep 2018, 2:29 pm
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా స్పందించారు. టీడీపీ పట్ల తమకు కేవలం జాలి మాత్రమే ఉందని ఈర్ష్య పడేందుకు ఆస్కారమే లేదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu GVL and chandrababu


‘చంద్రబాబు గారు, నిన్న ప్రెస్ మీట్ (సెప్టెంబర్ 28) లో మీరేదో ఐక్య రాజ్య సమితిలో ఖ్యాతి తెచ్చుకుంటే మేము ఈర్ష్య పడుతున్నాము అన్నారు. ప్రకృతి సేద్యంలో ఏమైనా సాధిస్తే గదా ఖ్యాతి! ఇది కేవలం మీరు చేసుకునే ప్రచారం, ఆత్మస్తుతి మాత్రమే. దానికి మీ పార్టీ పట్ల జాలి తప్ప ఈర్ష్య పడేంతగా ఏమీ సీన్ లేదు’, ‘చంద్రబాబు గారు, నిన్న ప్రెస్ మీట్ లో మోడీ గారు ఏమి సాధించారు అన్నారు. మీకిష్టమైన Bloomberg రిపోర్ట్ చదవండి. మన దేశం మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక శక్తి అయ్యింది. IMF ప్రకారం 2022 నాటికీ 4వ పెద్ద ఎకానమీ అవబోతోంది. ఇక మీ అబద్ధాలు ఆపండి’ అంటూ చంద్రబాబుకు వరుస ట్వీట్లతో జీవీఎల్ సూచించారు.

కాగా, ఇటీవల అమెరికా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చెప్పుకున్న గొప్పలపై ప్రతిపక్ష వైసీపీ సైతం గుర్రుగా ఉంది. వ్యవసాయాన్ని గాలికొదిలేసిన ఘనుడిగా పేరున్న చంద్రబాబు.. ఏపీ వ్యవసాయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, సేంద్రీయ సేద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్నామంటూ చెప్పడాన్ని వైసీపీ నేతలు విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.