యాప్నగరం

Cyclone Titli: ఇంకా అంధకారంలోనే సగం గ్రామాలు, టీడీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

నేను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే కారణంగానే సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను వాయిదా వేసుకున్నా. అంతే కానీ కవాతు కోసం కాదు. విమర్శించే ముందు కాస్త నిగ్రహం పాటించండని టీడీపీ నేతలకు పవన్ హితవుల పలికారు.

Samayam Telugu 18 Oct 2018, 3:53 pm
తిత్లీ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘జియో ట్యాంగింగ్ ద్వారా తమకు జరిగిన నష్టాన్ని ఫొటోలు తీసి పంపాలని ప్రజలను కోరుతూ.. ఏపీ సర్కారు ఓ యాప్ ప్రారంభించింది. కానీ ఆరు రోజులు గడిచినప్పటికీ.. ఇంకా సగం గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయ’ని పవన్ తెలిపారు. చీకట్లో మగ్గుతున్న వారికి వెలుతురును ప్రసాదించడంటూ సీఎం చంద్రబాబును కోరుతూ పవన్ ట్వీట్ చేశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారని జనసేనాని తెలిపారు.
Samayam Telugu pk at narsapuram


‘సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో నా పర్యటన కారణంగా పునరావాస, సహాయక కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు తలెత్తొద్దని భావించాను. అందుకే నా పర్యటనను వాయిదా వేసుకున్నాను. అంతే కానీ కవాతు వల్ల కాద’ని పవన్ తెలిపారు. విమర్శలు దిగే ముందు నిగ్రహం పాటించడం నేర్చుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.
మీరు చేసే ప్రతి అర్థ రహితమైన విమర్శకు భవిష్యత్తులో జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏదీ మా దృష్టికి రాకుండా పోవడం లేదంటూ టీడీపీ నేతలను జనసేనాని హెచ్చరించారు.
జనసేన పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ. మా క్షేత్ర స్థాయి పర్యటనలను విమర్శించడం మానుకోండి. టీడీపీ విజయంలో మేం కీలక పాత్ర పోషించిన విషయం మర్చిపోవద్దని పవన్ ట్వీట్ చేశారు.

తిత్లీ సైక్లోన్ వల్ల వాటిల్లిన నష్టాన్ని కళ్లకు కట్టే.. ఫొటోలు, వీడియోలతో ట్విట్టర్లో రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తుంటా. ఇక్కడ వాటిల్లిన భారీ నష్టం గురించి ప్రపంచానికి తెలీదని పవన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.