యాప్నగరం

వరంగల్‌: బీజేపీ ధర్నాలో అపశృతి.. దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా..

నిరసన కార్యక్రమం తర్వాత బీజేపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్థం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న బీజేపీ నేతలకు అంటుకుంది. దిష్టిబొమ్మకు నిప్పంటిస్తున్న శ్రీనివాస్ అనే కార్యకర్తపై కిరోసిన్ పడి అతడికి నిప్పు అంటుకుంది.

Samayam Telugu 24 Jun 2019, 5:44 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీ ధర్నా కార్యక్రమంలో అపశృతి
  • దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా మంటలు
  • మంటలు అంటుకొని ముగ్గురికి గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
హన్మకొండలో చిన్నారి హత్యాచార ఘటనను నిరసస్తూ సోమవారం బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి పట్టణంలో భారీ ర్యాలీ చేసి.. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు నేతలు, కార్యకర్తలు.
నిరసన కార్యక్రమం తర్వాత బీజేపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్థం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ కార్యకర్త హడావిడిగా దిష్టిబొమ్మకు మంటను అంటించాడు. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న బీజేపీ నేతలకు అంటుకుంది. దిష్టిబొమ్మకు నిప్పంటిస్తున్న శ్రీనివాస్ అనే కార్యకర్తపై కిరోసిన్ పడి అతడికి నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటూ మరో మహిళా కార్యకర్తకు గాయాలయ్యాయి. బాధితుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.