యాప్నగరం

హరితహారం కోసం సరికొత్త అవతారం..

హైద‌రాబాద్ న‌గ‌రానికి పచ్చల హారాన్ని తొడగడానికి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు..

TNN 7 Dec 2022, 12:23 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం (జులై 12) కరీంనగర్‌లోని మానేరు డ్యాం తీరంలో మొక్కలు నాటి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హ‌రిత‌హారాన్ని ఉద్య‌మంలా చేప‌డుతున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల స‌హ‌కారం కూడా ఎంతో అవ‌స‌రం. ఈ ఏడాది 40 కోట్ల మొక్క‌ల‌ను నాట‌డానికి ప్ర‌భుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆకుప‌చ్చ తెలంగాణ‌ కోసం.. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు హైద‌రాబాద్ న‌గ‌రానికి పచ్చల హారాన్ని తొడగడానికి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. హ‌రిత‌హారంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహన పెంచడానికి తాజాగా ఆయన వినూత్న ప్రయత్నానికి చుట్టారు శ్రీకారం చుట్టారు‌. రొటీన్‌కు భిన్నంగా.. ఈ సారి హ‌రిత‌ హారాన్ని స‌రికొత్త ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయన ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.
Samayam Telugu Haritha Haram


చెట్ల‌పై సందేశాత్మ‌క చిత్రాల‌ను పెయింటింగ్ చేయించి, అంద‌రికీ హ‌రిత‌హారం ప్ర‌ధాన్యాన్ని తెలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. హ‌రిత‌హారానికి క‌ళాత్మ‌క‌త‌ను జోడించి ప్ర‌జ‌ల్లో మ‌రింత ప్ర‌చారం జ‌రిగేలా చేస్తున్న‌ట్లు వివరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్లో షేర్ చేశారు.
Haritha Haram with an arty twist😊 @zcwz_ghmc initiated some interesting art work on Trees 🌲 more to go pic.twitter.com/OOp6jGLmNx— KTR (@KTRTRS) July 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.