యాప్నగరం

పాతబస్తీలో 1.20 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈ హవాలా డబ్బు చేరవేస్తున్నారని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్టేసన్ ఎస్‌హెచ్‌వో వివరించారు.

Samayam Telugu 29 Oct 2018, 7:25 pm
హైదరాబాద్‌లో కోట్ల రూపాయల నగదు అక్రమ తరలింపు కలకలం రేపింది. పాతబస్తీ షా ఇనాయత్‌ గంజ్‌ పోలీసులు, స్పెషల్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 1.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కుమారన్, ప్రేమ్ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తుండగా కానిస్టేబుల్స్ జగదీష్, గౌస్ వీరిని ఆపి తనిఖీ చేశారు. వీరి వద్ద ఉన్న బ్యాగుతో పాటు యాక్టివా డిక్కీలో తనిఖీ చేయగా మొత్తం కోటి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.
Samayam Telugu Hawala Money


స్వాధీనం చేసుకున్న నగదును ఎస్ఐ శ్రీనివాస్ ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించినట్లు షా ఇనాయత్‌ గంజ్‌ ఎస్‌హెచ్ఓ మీడియాకు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని కానిస్టేబుల్స్ జగదీష్, గౌస్ తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.

వినోద్ అనే వ్యక్తి డబ్బు ఇచ్చారని, పాతబస్తీ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లి ఓ వ్యాపారికి నగదు అప్పగించేందుకు వెళ్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈ హవాలా డబ్బు చేరవేస్తున్నారని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.