యాప్నగరం

అమరావతిలో హెచ్‌సీఎల్ భారీ పెట్టుబడి

ఐటీ దిగ్గజాలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అతి త్వరలో ఏపీలో అడుగుపెట్టబోతోంది.

TNN 23 Feb 2017, 4:25 pm
ఐటీ దిగ్గజాలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అతి త్వరలో ఏపీలో అడుగుపెట్టబోతోంది. అతి పెద్ద డెవలప్‌మెంట్ సెంటర్‌ను అమరావతిలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వెయ్యి కోట్ల పెట్టుబడిని పెట్టడానికి హెచ్ సీఎల్ సిద్దమైంది. ప్రస్తుతం హెచ్ సీఎల్ యాజమాన్యం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలు సఫలం అయితే అమరావతిలోని నిరుద్యోగుల పంట పండినట్టే. పెద్ద ఐటీ సంస్థ అమరావతిలో పెట్టబోతున్న అతిపెట్ట ఇన్వెస్ట్ మెంట్ ఇదే కూడా. అయితే ఈ కంపెనీ పెట్టడానికి అమరావతిలో దాదాపు 30 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఆ భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. కాగా ఈ విషయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ, హెచ్ సీఎల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.