యాప్నగరం

గుంటూరు: మద్యం మత్తులో మహిళపై హెడ్ కానిస్టేబుల్ వీరంగం

గుంటూరు నగరంలో కొందరు మహిళలను ఓ హెడ్‌కానిస్టేబుల్‌ విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకొచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన వారితో మితిమీరి ప్రవర్తించాడు.

Samayam Telugu 3 Sep 2018, 8:17 pm
పోలీస్ స్టేషన్‌లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించాడు. విచారణ కోసం స్టేషన్‌కు తీసుకొచ్చిన మహిళలపై చెప్పుతో దాడి చేశాడు. మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే ఇలా అవమానించాడు. గుంటూరులోని నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం (సెప్టెంబర్ 2) రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా వివాదాస్పదంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu Guntur


గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు విచారణ పేరుతో ఆదివారం రాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన మహిళలు అని కూడా చూడకుండా వారితో మితిమీరి ప్రవర్తించాడు. ఓ మహిళను చెప్పుతో కొట్టాడు.

మహిళలపై కానిస్టేబుల్ వీరంగం చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ ఫోన్లలో చిత్రీకరించారు. సదరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

హెడ్ కానిస్టేబుల్


విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే హెడ్‌‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్ రావు మహిళలను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ అనంతరం కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ ఏపీలో మొదటి మోడల్ పోలీస్ స్టేషన్ కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.