దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభలో బుధవారం (నవంబర్ 15) ప్రశ్నోత్తరాల సందర్భంగా ‘దివ్యాంగుల సామాజిక అభ్యున్నతి’పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 5 లక్షల మంది దివ్యాంగులకు రూ. 1500 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి స్కాలర్షిప్స్ ఇస్తున్నామని, స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
దివ్యాంగులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు తుమ్మల తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘దివ్యాంగులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు 3 శాతం నుంచి 4 శాతానికి పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరి లోగా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం’ అని తుమ్మల తెలిపారు.
దివ్యాంగులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు తుమ్మల తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘దివ్యాంగులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు 3 శాతం నుంచి 4 శాతానికి పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరి లోగా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం’ అని తుమ్మల తెలిపారు.