కర్నూలు ఆలూరు మండలంలో జరిగిన పేలుడు ఘటనలో 11 మంది మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బ్లాస్టింగ్ పరిశ్రమలో కెమికల్ వాడినట్లుగా అనుమానం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన హత్తిబెళగల్ క్వారీ శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి చెందినదని తెలుస్తోంది. కాగా క్వారీ యజమానులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. మృతులు అందరూ ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. రాళ్ల మధ్య భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ తో పాటు కెమికల్స్ కూడా వాడినందు వలెనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలను ఆదుకుంటామని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంను అందిస్తున్నామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. మృతులు అందరూ ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. రాళ్ల మధ్య భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ తో పాటు కెమికల్స్ కూడా వాడినందు వలెనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలను ఆదుకుంటామని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంను అందిస్తున్నామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.