యాప్నగరం

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 17 Aug 2018, 8:05 pm
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోని వరద పోటెత్తింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. కాగా.. ప్రస్తుత నీటిమట్టం 878.8 అడుగులుగా ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 181.832 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కొనసాగితే ఆదివారం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది.
Samayam Telugu srisalam


మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్‌లోకి కూడా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 28 గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 89.896 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 100 టీఎంసీలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.