యాప్నగరం

కొంతమంది విద్యార్థుల కొంపముంచిన వర్షం

శనివారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవాళ ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి

Samayam Telugu 15 May 2016, 10:34 am
శనివారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవాళ ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి హాజరుకావాల్సి వున్న కొంతమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భారీ వర్షం, ఈదురు గాలుల తీవ్రతకి రోడ్లపై అడ్డంగా కూలిపోయిన చెట్లు, హోర్డింగులు ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగించాయి. దీంతో విద్యార్థులు కొంతమంది ఎగ్జామినేషన్ సమయానికి పరీక్షా కేంద్రాలకి చేరుకోలేకపోయారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న నిబంధన కారణంతో అధికారులు సదరు విద్యార్థులని పరీక్షా కేంద్రం బయటే నిలిపివేశారు. ట్రాఫిక్ కారణంగానే తమకి ఆలస్యమైందని విద్యార్థులు ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో తాము ఒక విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వుంటుందని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
Samayam Telugu heavy rain in hyderabad gives trouble to eamcet students in hyderabad
కొంతమంది విద్యార్థుల కొంపముంచిన వర్షం


తాను ఇంటివద్ద ఉదయం 7 గంటలకే బయలుదేరినప్పటికీ... ట్రాఫిక్ అంతరాయంతో ఒక్క నిమిషం ఆలస్యమైందని, అయినా అధికారులు లోపలికి అనుమతించలేదని నిజాం కాలేజీ వద్ద మీడియాతో వాపోయింది ఓ విద్యార్థిని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.