యాప్నగరం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. సముద్రం అల్లకల్లోలం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తూఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Samayam Telugu 9 Jul 2018, 4:05 pm
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం ఇన్‌కాయిస్ తెలిపింది. అటువాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీరం వెంట కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తూఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతం భయానకంగా ఉంది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..
Samayam Telugu Vizag


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ తీరంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు అండమాన్ నికోబార్ తీరప్రాంతాల్లో అలలు ఉద్ధృతంగా ఎగసిపడతాయని ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న 72 గంటలపాటు విశాఖపట్నం, కళింగపట్నం, బరువ మండలాల పరిధిలో సముద్ర తీరం వెంట 3 నుంచి 4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని ఏపీ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ హెచ్చరించింది. ఇప్పటికే తమిళనాడులోని కోలాచల్, ధనుష్కోటి తదితర ప్రాంతాల్లో అలలు 5 మీటర్లకు పైగా అలలు ఎగసి పడుతున్నాయి. గంటకు 35 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.