యాప్నగరం

కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

TNN 24 Sep 2016, 5:49 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నల్గొండ, గుంటూరు జిల్లాల పరిధిలో కురుస్తున్న భీకర వర్షాల కారణంగా వరద ఉధృతి అమాంతంగా పెరుగుతూ వస్తోంది. కాగా ఇంతటి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో శనివారం ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ (70 గేట్లు) పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పటి వరకు మొత్తం 1.33 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. పలుచోట్ల వరద నీరు రోడ్లు, ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో కృష్ణా దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలదిగ్భందంలో ఉన్న గ్రామాల్లో సహాహక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు-నల్గొండ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్థంబించి పోయింది. గుంటూరు -సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను ఇప్పటికే నిలిపివేసిన విషయం తెలిసిందే. బస్సు సర్వీసులను కూడా పాక్షికంగా నడుపుతున్నారు. అనుకున్న స్థాయి కంటే అధిక స్థాయిలో వర్షం పాతం నమోదవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
Samayam Telugu heavy rains effect heavy flood water in the river krishna
కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు



Heavy Raims in Telugu states

Flood water in the river Krishna was largely due to heavy rains. All the Prakasam Barrage gates lifting due to the Heavy flood water.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.