యాప్నగరం

ఏపీని వణికించిన అకాలవర్షం.. పిడుగుపాటుకు ఆరుగురి మృతి

ఏపీని అకాలవర్షం వణికించింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా.. అక్కడక్కడా వడగళ్లు కూడా పడ్డాయి.

Samayam Telugu 31 May 2018, 9:04 pm
ఏపీని అకాలవర్షం వణికించింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా.. అక్కడక్కడా వడగళ్లు కూడా పడ్డాయి. గాలుల దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. వర్షంతో పాటూ కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడ్డాయి. గుంటూరు జిల్లా ఫిరంగపురం సమీపంలో పిడుగు పాటుకు ఒకరు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నర్సరావుపేట మండలం కొండకావూరు, దొండపాడుల్లో కూడా పడి మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. అలాగే ప్రకాశం జిల్లా దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో పిడుగులు పడి ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ మరొకరు చనిపోయారు.
Samayam Telugu Thunder


క్యుమిలోనింబస్ మేఘాలతో వర్షాలు పడుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతుండగా.. రాబోయే 24 గంటల్లో కూడా అక్కడక్కడా పిడుగులు పడతాయని విపత్తు నివారణశాఖ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, కంచికర్ల.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, ముప్పాళ్లు, నకిరేకల్, రాజుపాలెం, ఈపూరు.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కొనకనమిట్లలో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.