మూడురోజుల్లో మళ్లీ అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది.
TNN 19 Nov 2016, 8:24 am
ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే హిందూ మహా సముద్రంలో బంగాళాఖాతం వెంబడి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమేణా అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. హిందూ మహాసముద్రం నుండి అది అల్పపీడనంగా మారి బంగాళాఖాతం వైపునకు రావచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21వ తేదీకి పూర్తి స్థాయి అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ కేంద్రం భావిస్తోంది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియవచ్చు. దీని ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రపై ఉండవచ్చు.