యాప్నగరం

కుండపోతలా కురిసిన వర్షానికి ఇద్దరు బలి

హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి కుండపోతలా కురుస్తున్న అతి భారీ వర్షం ఇద్దరిని బలితీసుకుంది.

TNN 3 Oct 2017, 1:20 am
హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి కుండపోతలా కురుస్తున్న అతి భారీ వర్షం ఇద్దరిని బలితీసుకుంది. బంజారాహిల్స్‌లోని నాయుడు నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎగువన వున్న ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం వరద నీరులా మారి నాయుడు నగర్‌ని ముంచెత్తింది. వరద నీటి ప్రవాహం కారణంగా నాయుడు నగర్ పూర్తిగా జలమయమైంది.
Samayam Telugu heavy rains in hyderabad claims two lives
కుండపోతలా కురిసిన వర్షానికి ఇద్దరు బలి

హైదరాబాద్‌లో సోమవారం ఉన్నట్టుండి కుండపోతలా కురిసిన భారీ వర్షం ఇద్దరిని బలితీసుకుంది #HyderabadRains #Hyderabad #HeavyRains #TeluguNews pic.twitter.com/pF5kg8peJT— Samayam Telugu (@SamayamTelugu) October 2, 2017
నగరంలో కురిసిన అతి భారీ వర్షం అనేక ప్రాంతాలని వరద నీటితో ముంచెత్తింది. దీనికితోడు ఉప్పొంగిన నాలాలు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లో వున్న జనం బిక్కుబిక్కుమంటూ ఏ క్షణం ఏం జరుగుతుందా అనే భయంతో గడపాల్సిన దుస్థితి తలెత్తింది.

ఇదిలావుంటే, శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలు ఈ భారీ వర్షానికి కూలిపోయే ప్రమాదం వున్నందున అటువంటి నిర్మాణాల్లో వుండేవారు వీలైనంత త్వరగా తమతమ నివాసాలని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.