యాప్నగరం

రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు.

Samayam Telugu 21 Jul 2018, 5:29 pm
Samayam Telugu rain
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళా ఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను అనుకొని వాయుగుండం ఏర్పడింది. బెంగాల్ తీర ప్రాంతంలో శనివారం (జులై 21) సాయంత్రానికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.