తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా విస్తరించాయి. దీని వల్ల రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. రుతుపవనాల రాకతో పాటూ, బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం, విదర్భ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించడం వంటి వాటి ప్రభావం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు కూడా బాగా బలపడ్డాయని చెప్పారు. కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయి.
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల వల్ల రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
TNN 23 Jun 2016, 10:38 am