యాప్నగరం

మన నోట్లో ‘మట్టి’గొడుతున్న కర్ణాటక!

ఆలమట్టి డ్యాం నిండా నీటిని ఒడిసిపట్టుకుంటూ.. తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టిగొడుతోంది కర్ణాటక.

TNN 13 Aug 2017, 2:22 pm
కర్ణాటక రాష్ట్రం ఆలమట్టి డ్యాం నిండా నీటిని ఒడిసిపట్టుకుంటూ.. తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టిగొడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో నీరు చేరుతున్నా కిందకి విడుదల చేయడం లేదు. ఎత్తి పోతల పథకాల ద్వారా ఆ రాష్ట్రం వచ్చిన నీటిని వచ్చినట్లే పలు ప్రాజెక్టులకు తరలిస్తోంది. దీంతో చుక్క నీరు కూడా కిందికి రావడం లేదు. మరోవైపు మన శ్రీశైలం డ్యాంలో నీళ్లు అడుగంటాయి. కనీసం తాగడానికైనా కొన్ని నీళ్లను వదలమంటూ వేడుకున్నా.. ఆ రాష్ట్రం కనికరించడం లేదు.‌ ఈ విషయంలో ఉన్న న్యాయపరమైన అంశాల్ని తెలుగు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి.
Samayam Telugu heavy water inflow for almatti but no water release for telangana and ap
మన నోట్లో ‘మట్టి’గొడుతున్న కర్ణాటక!


నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటికి ఇబ్బంది అవుతోందని, కనీసం తాగడానికైనా కొంత నీటిని విడుదల చేయాలంటూ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఆలోచిస్తామంటూ.. ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

ఇది కేవలం ఇప్పటి సమస్య కాదు.. ఏటా ఇలాగే జరుగుతోంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. సాగుకు అటుంచి తాగు నీటికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఏం చేయాలని తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు రెండూ నిండాయి. ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. 6000 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. ఆ రాష్ట్ర ఉద్దేశమేమిటో ఈ ఉదంతోనే అర్థమవుతోంది. ఆగస్టు రెండో వారం పూర్తవుతున్నా.. శ్రీశైలానికి చుక్క నీరు రాలేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.